సింగపూర్ ప్రభుత్వం 2026 జనవరి 30 నుంచి కొత్త 'నో బోర్డింగ్' నిబంధనను అమలు చేస్తుంది. దీని ప్రకారం, సింగపూర్కు వెళ్లే ప్రయాణికులను విమానం ఎక్కే ముందే, అంటే బయలుదేరే విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ తనిఖీలు చేస్తారు. అర్హత లేనివారిని విమానం ఎక్కనివ్వరు. వీసా, పాస్పోర్ట్ చెల్లుబాటు, SG అరైవల్ కార్డ్ వంటి అంశాలపై తనిఖీలు జరుగుతాయి. గతంలో సింగపూర్ చేరుకున్నాకే ఈ తనిఖీలు జరిగేవి. ఈ నిబంధనలను పాటించని విమానయాన సంస్థలపై సింగపూర్ ప్రభుత్వం జరిమానా విధించనుంది.