తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట కేసులో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సాక్షులను మంత్రులు ప్రభావితం చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కాగా టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయిన విషయం తెలిసిందే.