కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా సోమవారం 'ఆయుష్మాన్ సారథి' పేరుతో పీఎం-జేఏవై వాట్సాప్ చాట్బాట్ను ప్రారంభించారు. దీని ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులు 24 గంటలూ, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చు. ఆయుష్మాన్ కార్డులు పొందడం, సమాచారం తెలుసుకోవడం, ఫిర్యాదులు చేయడం వంటివి ప్రభుత్వ కార్యాలయాలకు లేదా కాల్ సెంటర్లకు వెళ్లకుండానే చేసుకోవచ్చు. ఈ చాట్బాట్ నేరుగా పీఎం-జేఏవై వ్యవస్థకు అనుసంధానించి నిజ సమయంలో సమాచారాన్ని అందిస్తుంది. +91 72908 23838 నంబర్కు “Hi” అని పంపడం ద్వారా లేదా QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా దీనిని ఉపయోగించవచ్చు.