బిహార్ ముఖ్యమంత్రిగా పదో విడత ప్రమాణం చేసిన నీతీశ్కుమార్కు డిసెంబరు 5న లండన్కు చెందిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ గుర్తింపు లభించింది. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా ఈ విషయాన్ని ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. నీతీశ్ అసాధారణమైన మైలురాయిని చేరుకోవడానికి లభించిన ఈ గుర్తింపు, అభినందన గర్వకారణమని, దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది అరుదైన ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.