సముద్రంలో పడవ బోల్తా.. 60 మందికిపైగా జలసమాధి

లిబియా తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో మహిళలు, చిన్నారులు సహా 60 మందికి పైగా మరణించారు. ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. శనివారం మధ్యధరా సముద్రం గుండా వెళుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఐరోపాలో మెరుగైన జీవితాన్ని కోరుకునే వారికి మధ్యధరా సముద్రం ప్రమాదకరమైన మార్గం. ఇప్పటికే వందలాది మంది ఇలాంటి పడవల్లో ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :