కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించిన ఈ బడ్జెట్లో పలు వస్తువుల ధరలపై ప్రభావం చూపనుంది. విమాన భాగాలు, మైక్రోవేవ్ ఓవెన్లు, EV బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు, డయాబెటిక్ & క్యాన్సర్ మందులు, భారతదేశంలో తయారయ్యే స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు చౌకగా లభించే అవకాశం ఉంది. మరోవైపు, లగ్జరీ గడియారాలు, దిగుమతి చేసుకున్న మద్యం, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కొన్ని ఎరువులు, దిగుమతి చేసుకున్న టీవీ పరికరాలు, కెమెరాలు, సినిమా షూటింగ్ పరికరాలు ఖరీదైనవిగా మారనున్నాయి.