HYDలోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ తో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిక్ ఘోష్ కమిషన్ ఇచ్చిన తుది నివేదికపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై లోతుగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా మొత్తం 115 మందిని విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది.