తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. భూభారతి పోర్టల్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. తొలుత 3 మండలాల్లో (సాగర్, తిరుమలగిరి, కీసర) ప్రయోగాత్మకంగా అమలుచేసి, జూన్-2 నాటికి పూర్తి స్థాయిలో విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.