కొత్త చట్టాల ప్రకారం.. జీరో ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటి కీలక అంశాలు ఉండనున్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్కు వెళ్లనవసరం లేకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో తేలికగా, వేగంగా ప్రజలు తమ సమస్యను పోలీసులకు తెలియజేయవచ్చు. వీటిపై ఇప్పటికే పోలీసులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇచ్చారు.