TG: సీసీఐ టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జిన్నింగ్ మిల్లుల జాబితాను కలెక్టర్లకు పంపించి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. దీంతో పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు CCI ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సోమవారం పత్తి క్లీనింగ్ ధరలపై సంప్రదింపులు పూర్తయ్యాక మిల్లర్లతో CCI ఒప్పందం చేసుకోనుంది. టెండర్లు ఆమోదించాక మిల్లర్ల వివరాలు కలెక్టర్లకు అందజేస్తారు. తర్వాత ఆ మిల్లులను పత్తి కొనుగోళ్లు కేంద్రాలుగా నోటిఫై చేస్తారు.