దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 5వ తరగతి వరకు పాఠశాలలను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రుల సౌకర్యాన్ని బట్టి విద్యార్థులు ఆన్లైన్ లేదా ప్రత్యక్ష తరగతులకు హాజరు కావచ్చని తెలిపింది. పంటల దహనం, పండగ టైంలో ఫైర్క్రాకర్ల ప్రభావంతో AQI ప్రమాద స్థాయిలో ఉండటంతో ఈ చర్యలు తక్షణం అమల్లోకి తెచ్చినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.