అల్లు అర్జున్ను సినీ సెలబ్రిటీటీలు పరామర్శించడంపై సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఓ బాలుడు నెల రోజులుగా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే వీళ్లెవరైనా పరామర్శించారా? ఒకపూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్లు వెళ్లారు. అక్కడేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? చేయి పోయిందా? కానీ ఆస్పత్రిలో ఓ ప్రాణం పోయింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని వ్యాఖ్యానించారు.