ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత తీవ్రమవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని తనపల్లి వద్ద ఒక పెట్రోల్ బంకు యజమాని రాజేష్రెడ్డి టూవీలర్ వాహనాలకు లీటరు పెట్రోల్ ఉచితంగా అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు భారీగా క్యూ కట్టారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు బంక్ యజమాని వెల్లడించారు.