ప్రభుత్వ పథకాల్లో, పథకాల ప్రకటనల్లో జీవించి ఉన్న రాజకీయ నాయకుల పేర్లు, మాజీ సీఎంల ఫొటోలు ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు పెట్టనివ్వొద్దంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.