దేశంలో ఓట్ల తొలగింపు ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలు సీఈసీ తోసిపుచ్చింది. ఢిల్లీ నుంచి సీఈఓ రాజీవ్ కుమార్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. 'CEOగా నాకు ఇదే చివరి ప్రెస్ కాన్ఫరెన్స్. దేశ వ్యాప్తంగా ఒక ఎలక్షన్ సైకిల్ పూర్తి చేసుకున్నాం. గతేడాది ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం. ఈ ఏడాది తొలి ఎన్నిక ఢిల్లీలో జరగబోతున్నాయి. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది' అని తెలిపారు.