ఓటరు కార్డులపై సీఈసీ సంచలన నిర్ణయం

ఓటరు కార్టులపై సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆధార్‌ సీఈవో, సాంకేతిక సిబ్బంది తదితరులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఓటరు ఐడీలను త్వరలో ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఆర్టికల్‌ 326, 1950 ఆర్‌పీ యాక్ట్‌, సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియకు సంబంధించి UIDAIతో సంప్రదింపులు జరపనున్నట్లు సీఈసీ తెలిపింది.

సంబంధిత పోస్ట్