ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున, పంటల ఎంపికలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నీటి వసతి తక్కువగా ఉన్నవారు వరి వంటి పంటలకు బదులుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం మేలని వారు చెబుతున్నారు. బోరుబావుల వంటి కచ్చితమైన నీటి వనరులు ఉన్న రైతులు మాత్రమే అధిక నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని తెలిపారు.