EPFO తన సేవలను మరింత డిజిటల్ చేస్తూ 'EPFO 3.0' పేరుతో కొత్త వ్యవస్థను తీసుకురానుంది. దీని ద్వారా సభ్యులు తమ PF ఖాతాలోని అర్హత కలిగిన మొత్తాన్ని నేరుగా UPI లేదా ATMల ద్వారా ఉపసంహరించుకునే అవకాశం కల్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కొత్త విధానం PF డబ్బు పొందే ప్రక్రియను వేగవంతం, సులభతరం, పారదర్శకంగా మారుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సేవలు పొందాలంటే UANను ఆధార్తో అనుసంధానం చేయడం, బ్యాంక్ ఖాతా, PAN, మొబైల్ నంబర్ వివరాలు సరిగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ సేవలను ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై ఇంకా తేదీ ప్రకటించలేదు.