తెలంగాణ హైకోర్టులో గురువారం నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్.. జస్టిస్ గౌస్ మీరా మొహినుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.