మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయేంద్ర బోయి డీఈఓ ప్రవీణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుట పిల్లలందరికీ కనీసం రాయడం చదవడం నేర్పుట, ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపి కార్యక్రమాలను ఎఐ ఆధారంతో నిర్వహించాలన్నారు. అన్ని మౌలిక వసతులు కల్పించుట ఆకర్షణీయమైన బడి వాతావరణం కల్పించుట, పిటిఎంలు నిర్వహించి విద్యను అందించే విధంగా పాఠశాలను బలోపేతం చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు.