గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఊరట లభించే అవకాశం ఉంది. చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఎల్పీజీ, పీఎన్జీపై పన్నులు తొలగించాలనికేంద్రాన్ని కోరుతూ ఓ లేఖ రాసింది. ఈ ప్రతిపాదన అమలైతే గృహ వినియోగ సిలిండర్పై రూ.100 వరకు, కమర్షియల్ సిలిండర్పై రూ.317 వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ, ధర పెంపులను తగ్గిస్తే వినియోగదారులపై భారం గణనీయంగా తగ్గనుంది. అయితే తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది.