TG: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నియామకాలకు ప్రధాన ఆటంకంగా ఉన్న సుప్రీం కోర్టు స్టేను వెకేట్ చేయించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం మంత్రి సీతక్క సమావేశం నిర్వహించి, న్యాయ చిక్కులపై సలహాలు స్వీకరించారు.