కేరళ ప్రభుత్వం కొత్తగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం సీసాలు పెరిగిపోతున్న వ్యర్థ సమస్యను తగ్గించేందుకు వినూత్న విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై ప్రతి మద్యం బాటిల్పై రూ.20ను అదనంగా డిపాజిట్గా వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. వినియోగదారులు ఖాళీ సీసాను తిరిగి మద్యం దుకాణానికి ఇచ్చినట్లయితే, ఆ డిపాజిట్ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లించనున్నారు.