మూడేళ్లుగా లావాదేవీలు లేని పీఎఫ్ నిధులు నేరుగా ఖాతాదారులకే!

మూడు సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరగని ఇనాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాల్లోని నిధులను నేరుగా ఖాతాదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. ఆటో సెటిల్‌మెంట్ విధానం ద్వారా ఈ ప్రక్రియ జరగనుంది. ఆధార్, కేవైసీ, బ్యాంక్ ఖాతా అనుసంధానం పూర్తయితే, క్లెయిమ్ చేయకపోయినా నిధులు జమ అవుతాయి. మొదట రూ. వెయ్యి లోపు నిధులకు ఈ విధానం అమలు కాగా, ఇప్పుడు పెద్ద మొత్తాలకు విస్తరిస్తున్నారు. ఖాతా ఇనాక్టివ్‌గా మారకుండా ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ బదిలీ, యూఏఎన్ అనుసంధానం, ఆధార్, బ్యాంక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్