TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఇంటి నిర్మాణంలో బయట గోడలకు ప్లాస్టరింగ్ చేసి, లోపల చేయకున్నా, ముందు దర్వాజ తలుపులు ఉండి, లోపలి గదులకు తలుపులు ఏర్పాటు చేయలేకున్నా, పూర్తి స్థాయి వైరింగ్, ప్లంబింగ్ పనులు పూర్తి చేయకపోయినా ఆఖరి బిల్లు కోసం లబ్ధిదారుతో ఉన్న ఇంటి చిత్రాల్ని తీసి బిల్లు కోసం సిఫార్సు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా చిన్న చిన్న హంగుల కోసం బిల్లులు నిలిపివేసే పరిస్థితి ఇకపై ఉండదని చెప్పారు.