తెలంగాణలో భూమిలేని పేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ఈనెల 28 నుంచి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణలో 4 చోట్ల ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు.