కేంద్రం గుడ్‌ న్యూస్.. ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా

పీఎఫ్ సేవలను సులభతరం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. EPFO 3.0లో భాగంగా త్వరలోనే ఏటీఎంల ద్వారా పీఎఫ్ నగదును సెకన్లలో విత్‌డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రత్యేక ఏటీఎం కార్డుల ద్వారా ఖాతాదారులు తమ పీఎఫ్‌లో 75% వరకు నగదును తీసుకోవచ్చు. ప్రస్తుతం క్లెయిమ్ ప్రక్రియకు పట్టే సమయం తగ్గనుంది. వైద్య, అత్యవసర అవసరాల కోసం ఈ సౌకర్యం ఉపయోగపడనుంది. అలాగే యూపీఐ ద్వారా పీఎఫ్ చందాలు చెల్లించే విధానాన్ని కూడా త్వరలో ప్రవేశపెట్టనుంది.

సంబంధిత పోస్ట్