కేంద్ర క్యాబినెట్ వొడాఫోన్-ఐడియాకు ఉపశమనం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిలు రూ.87,695 కోట్లను ఫ్రీజ్ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బకాయిలను 2032-41 మధ్య కాలంలో చెల్లించేందుకు అవసరమైన వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయం టెలికాం రంగంలో ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది.