కూకట్పల్లి నియోజకవర్గంలోని సమతానగర్లో మంజీరా నీటిలో డ్రైనేజీ కలవడం వల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించాలని, కొత్త పైప్లైన్ కోసం అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.