మల్కాజిగిరి జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం అధికారులు రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తొలగింపు చర్యలను దుకాణదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సీపీఎం కార్యాలయం కూడా కూల్చివేయడంతో వివాదం చెలరేగింది. సీపీఎం నేత కోమటి రవి, ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేయడం కక్షపూరిత చర్య అని ఆరోపించారు.