జీహెచ్ఎంసీ నిధులు రూ. 6 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాపై నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి–దోమలగూడ లింక్ బ్రిడ్జిని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. లింక్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో వాహన రాకపోకలు సులభతరం కానున్నాయి.