హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ డివిజన్లోని రామసింగపురంలో రోడ్డు పక్కన చెత్త వేయడాన్ని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ సూపర్వైజర్ మహేందర్ వినూత్న ప్రయత్నం చేశారు. స్థానికులు రోడ్డుపై చెత్త వేయకుండా ఉండేందుకు, తెల్లవారుజామునే అక్కడికి వెళ్లి, చెత్త వేసేవారిని కాళ్లు మొక్కి మరీ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ సిబ్బంది రోజూ చెత్తను తొలగిస్తున్నా సమస్య పునరావృతమవుతుండటంతో ఈ చర్య చేపట్టారు.