బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఇంచార్జీ, ఈవో తమ్మినేని శేఖర్ ను దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం సస్పెండ్ చేశారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అన్ని మార్పులు జరగాలని అధికారులను హెచ్చరించిన ఆమె, నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈవో సస్పెండ్ అయ్యారు.