TG: రేపటిలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఎల్లుండి నుండి బంద్ చేస్తామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఛైర్మన్ రమేష్ బాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిరవధిక బంద్ పాటిస్తాయని తెలిపారు. బంద్ సమయంలో జరిగే ఎగ్జామ్స్ కూడా వాయిదా వేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అసలు కళాశాలలకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఉందా? లేదా? అని రమేష్ బాబు ప్రశ్నించారు.