రేపటి నుంచే 'ఇంటిగ్రేటెడ్‌ భూభారతి' పోర్టల్‌ అమలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి(గురువారం) సమీకృత ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ అమలు కానుంది. ముందుగా ప్రయోగాత్మకంగా 5 మండలాలు.. కూసుమంచి, అశ్వారావుపేట‌, ఆమన్‌గ‌ల్‌, వ‌ట్‌ప‌ల్లి, కోస్గిలో ప్రయోగాత్మకంగా అమ‌లు కానుంది. భూ స‌మ‌స్యల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపేలా ఈ పోర్టల్‌‌ను సిద్ధం చేశారు. స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కడినుంచైనా భూమి సంబంధిత సేవ‌లు పొందేలా ఈ పోర్టల్‌ రూపొందించారు. ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్