మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్పల్లి గ్రామానికి చెందిన పేరం మహేందర్ ది స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ జగిత్యాల జిల్లా కమిషనర్గా నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర కమిషనర్ అశోక్ రాజ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో ది స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.