డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, "సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్"ను బీర్పూర్ ఎస్ఐ కుమార స్వామి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఎస్ఐ కుమార స్వామి మాట్లాడుతూ, "ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను వాడుతున్నారు. వాడకంతో పాటు జాగ్రత్తలు కూడా అవసరం. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.