జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ముందస్తు కార్యాచరణతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి వేడుకలను సమర్థవంతంగా నిర్వహించిందని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా వ్యాప్తంగా నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు.