అభిమాని హత్యకేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ తూగుదీప కోర్టును ఆశ్రయించారు. జైలులో భోజనం తనకు అరగడం లేదని.. బరువు సైతం తగ్గిపోయానని.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నటుడి పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్ తూగుదీప, నటి పవిత్ర గౌడ్ జూన్ 10న అరెస్టయిన విషయం తెలిసిందే.