కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగిన 'ప్రజావాణి' కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మదుమోహన్ మొత్తం 143 దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, చట్టప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.