లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ కేంద్రంలో మంగళవారం డీఎల్పీవో సురేందర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా, తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.