మధిర వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) స్వర్ణ విజయ్ చంద్ర పదోన్నతిపై మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిగా (డీఏవో) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధిరలో రైతులకు సేవలందించి, పథకాల అమలులో కీలక పాత్ర పోషించిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.