నేలకొండపల్లి: పనులు శరవేగంగా పూర్తి చేయాలి

నేలకొండపల్లి, చెరువుమాధారం సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ బుధవారం తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అవసరమైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని సీనియర్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్