ఆర్టీసీ ఖమ్మం రీజియన్ లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 86 కొత్త బస్సులు నడుపుతున్నామని రీజినల్ మేనేజర్ ఎ. సరిరాం తెలిపారు. మంగళవారం సత్తుపల్లి డిపోను తనిఖీ చేసిన ఆయన బస్సుల ఫిట్నెస్, బస్టాండ్ సౌకర్యాలపై ఆరా తీశారు. మెరుగైన రవాణా కల్పించడమే లక్ష్యంగా అదనపు బస్సులు ఏర్పాటు చేశామని, ఆదాయం పెంచేలా ఉద్యోగులు కృషి చేయాలని ఆయన సూచించారు.