అశ్వారావుపేట: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన మూడు నామినేషన్ కేంద్రాలను పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ గురువారం సందర్శించారు. మండల పరిషత్తు కార్యాలయం, మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ కార్యాలయం, పురపాలక సంఘ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామపత్రాలు దాఖలు చేసే అభ్యర్థులతో పాటు ఇద్దరిని మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్