ములకలపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం పర్యటించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణను తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలు పంపిణీ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలకు సూచించారు.