పోలీస్ శాఖలో 43 ఏళ్లుగా సేవలందించిన ఏఎస్సై మంచా నాయక్, స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వర్తిస్తూ శనివారంతో పదవీ విరమణ పొందారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఎస్పీ కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఆర్ఎస్సై సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు.