మణుగూరు: రోడ్డు భద్రతా అవగాహనా సదస్సు

మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించాలని, యువత ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాలను పణంగా పెట్టకుండా క్రమశిక్షణతో వాహనాలు నడపాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. నిబంధనలను పాటించడం తమ బాధ్యతగా గుర్తించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్