పినపాక మండలం జగ్గారం గ్రామపంచాయతీ సర్పంచ్ గొగ్గల సుహాసిని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు ఆ గ్రామపంచాయతీ 8 వార్డులు కూడా ఏకగ్రీవం అయినట్లుగా అధికారులు తెలిపారు. ఎన్నికల అధికారులు సర్పంచ్ సుహాసినికి గెలుపొందిన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుహాసిని తన ఏకగ్రీవ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.