టేకులపల్లి సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. టేకులపల్లి, దాసు తండా, సింగ్యాతండా, లచ్యా తండా, ఏ-కాలనీ, బీ-కాలనీ పరిధిలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.